Thursday, March 18, 2010

సమస్యా సప్తాహము ౪

ఈ రోజు దత్తపది

ఏజీ, ఓజీ, లోజీ, సునోజీ

పదాలు ఉపయోగించి ఆదిశేషావతార రామానుజ లక్ష్మణస్వామి గురించి ఒక పద్యం చెప్పండి


3 comments:

  1. గిరి గారూ ఇది పరిశీలించండి

    ఏజీతమ్ముయులేనికొల్వు ఇదియే, ఏకోదరుండైనబో,
    లోజీవింపగనూహసేయునెపుడో లోకంబునన్వేరుగా,
    సీ,జాయన్ యడబాసిబోవ తగవో జింతింపడే,సౌఖ్యముల్
    చేజారంగగణింపడే,తెలుసునోజీవాత్మబాంధవ్యమే.

    ReplyDelete
  2. బావుందండి. దత్తపదులలో మీకు సాటి లేరుగా.

    నా గీతమాలిక ఇదిగో.

    రామపాదములను రాజపదములుగా
    నెంచునో జితపడియుండి వనిన
    రాముడుండగ నితరము తెలుసునొ జీవి
    తమ్ము నగ్ర జాంకితమ్ము చేసి
    ఆజిలోజిగీషు డాదిశేషువలే జి
    ష్ణునుతు చెంతనుండ చూచువేళ

    ReplyDelete
  3. బావుందండీ, ఆశ్చర్యమేమంటే మామూలు గా చాల సులువైన మాటలలో వృత్తాలు వ్రాసే మీరు - దత్తపది అనగానే - గీతాలవైపు వెళ్తారు ఎందుకో.
    అన్నట్టు మీ ఈ కొత్త బ్లాగు కూడలిలో , హారం లో, పద్యం లో లేదా?

    ReplyDelete