మ. మన పూర్వీకుల వైభవంబు ధృతి సమ్మానాస్పదంబై మహిన్
మనుటల్ గ్రంథితమయ్యె, సంస్కృత పురాణంబుల్ మహోద్దండులౌ
ఘనవిద్వాంసులనీడ తెల్సికొని తత్గాథాత్మ లక్రైస్తవం
బనికల్లల్ సృజియించినట్టి దురితుల్ పాపాత్ము లాంగ్లేయులే
(తాత్పర్యము - మన పూర్వీకులు వైభవము, ధైర్యసాహసాలు, ఆదర్శప్రాయమైన వారి జీవితగాథలు పురాణాలలో గ్రంథస్థము చేయబడ్డవి. అట్టి పురాణ రహస్యాలు గొప్పవిద్వాంసుల వద్ద నేర్చుకొని, బైబిలు కథను చిన్నబుచ్చు ఆ గాథలను ఆకళింపుచేసుకొను శక్తిలేక, పురాణములను తూలనాడి, వాటి స్థానములో వట్టి బూటకపు చరిత్రను వ్రాసిపోయిన పాపాత్ములు అంగ్లేయులు)
బైబిలుకి సరిపడేటట్టు మన పురాణాంశాలను కుదించి భారతీయ చరిత్రను గందరగోళము చేసినవారిలో ప్రప్రథముడు సర్ విలియమ్ జోన్సు. కోట వెంకటాచలము గారి పుస్తకాలు చదివితే ఆంగ్లేయుల తప్పిదాలు తెలుస్తాయి. అ తప్పలు తెలుసుకోవలసిన అవసరము ప్రతి భారతీయునికీ ఉన్నది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment