Thursday, May 21, 2015

నేపాల భూకంపము

నిన్న నా సహోద్యోగి మల్లికార్జున్ నాకు చిన్న సమస్యనిచ్చి పద్య మొకటి వ్రాయమన్నాడు. హిమాలయాల ప్రస్తావనతో నేపాల్ భూకంపాన్ని గూర్చి సీసపద్యము వ్రాయాలి, మానససరోవర ప్రసక్తి ఉండాలి కానీ వేఱొక అర్థముతో ఉండాలి. దానికి సమాధానంగా నేను వ్రాసిన పద్యమిది.

సీ. సకలలోకాధిపప్రకటదేవాళి మా
నససరోవరము లనలము లగుట
నా హిమవత్పర్వతాగ్ర మాగ్రహ మంది
క్రింది నేలలఁ నణగించె నేమొ
భూమాత లోకాన పొంగిన కుటిలత్వ
రీతులకు జలదరించె నేమొ
ప్రకృతమ్మపై దాడి వికృతమ్ముగ సలుపు
వికటులఁజూచి కంపించె నేమొ

తే. రాక్షసత్వము ప్రబలి, అరాచకమ్ము
లోక మంతట గెలిచి, ప్రలోభ మెగయ
నేమి శాపమో తగిలె నా భూమి జనులఁ
గాలరాచె నేపాళ భూకంప మిటుల

No comments:

Post a Comment